ముస్లింల కోసం హిందువులను తాకట్టు పెడుతున్న చంద్రబాబు.. పరిపూర్ణానంద స్వామి
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా ఆ పార్టీలకు సంబంధించిన కొందరు నేతలు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు. ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కొందరు ఆశించిన సీట్లను వదులుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో హిందూపురం నుంచి సీటు ఆశించిన పరిపూర్ణానంద స్వామి చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పొత్తులో భాగంగా హిందూపురం టికెట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది.. దీంతో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మరియు శ్రీ పీఠం వ్యవస్థాపకుడు అయిన పరిపూర్ణానంద స్వామి నిరాశ చెందారు. కొంతకాలం నుంచి బీజేపీ తరఫున ప్రచారం సాగిస్తూ హిందూపురంలో పోటీకి మార్గాన్ని ఏర్పరచుకుంటూ వచ్చిన ఈయనకు కూటమి షాక్ ఇచ్చింది. హిందూపురం సీటును స్వామీజీ అయిన తనకు అప్పగిస్తే ముస్లింలు పార్టీకి దూరమవుతారని భావించి చంద్రబాబు ఇలా చేశారని ఆయన మండిపడ్డారు. పేరులోనే హిందువు ఉన్న హిందూపురం నుంచి పోటీ చేయాలి అని ఆశించానని.. అయితే కూటమి కారణంగా అది జరగలేదని ఆయన బాధపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హిందువులను ముస్లింల కోసం తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అని ఆరోపించారు.