నీల్- విజయ్ కాంబో అసాధ్యమే
కొన్ని కలయికలు రావాలని ఎంతో ఆశపడతాం కానీ అవి అంత ఈజీగా వర్కవుట్ అవవు. కొన్నిసార్లు చాలా ఎక్కువ మొత్తంలో టైమ్ పట్టొచ్చు లేదంటే అసలు అవి ఆశలుగా మిగిలిపోవచ్చు. రీసెంట్ గా హైదరాబాద్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను విజయ్ దేవరకొండ పీఏ కలిశాడు. దీంతో అందరూ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని, త్వరలోనే వీరి కలయికలో పాన్ ఇండియా సినిమా చూడొచ్చని ఏవేవో మొదలెట్టేశారు నెటిజన్లు.
ఈ మీటింగ్ ఎందుకు జరిగిందనేది పూర్తి వివరాలు తెలియకపోయినా ఈ ప్రాజెక్ట్ అయితే అసాధ్యం అనేది చాలా మందికి అర్థం అవుతుంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ కాంబో అసాధ్యమనే చెప్పాలి. నీల్ ముందుగా సలార్-2 చేయాలి. ఎంతలేదన్నా దానికి సంవత్సరం పైగానే పడుతుంది పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కోసం మరో ఆరు నెలలు పట్టొచ్చు.
ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో జూ.ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా తాలూకు స్క్రిప్ట్ ని పూర్తి చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేసుకోవాలి. దాని షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది మొదలు పెట్టాలి. కాబట్టి ప్రశాంత్ నీల్ ఫ్రీ అవాలంటే ఎంత లేదన్నా 2026 దాటుతుంది. ఇంత బిజీ షెడ్యూల్ లో నీల్ వేరే హీరోల గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు.