30 సంవత్సరాల కష్టం ఫలించడంతో భావోద్వేగానికి గురి అయిన కూటమి క్యాండిడేట్..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలు తమ క్యాండిడేట్లను మెల్లిగా అనౌన్స్ చేస్తూ పోతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్టు రాక కొందరు ఆందోళనకు గురి అవుతుంటే ..మరికొందరు ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూసిన టికెట్ చేతికి రావడంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో నరసాపురం కూటమి ఉమ్మడి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ తనకు టికెట్ రావడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం పట్టలేక తీవ్రమైన భావోద్వేగానికి గురి అయిన శ్రీనివాస వర్మ కార్యాలయం వద్ద కింద పచ్చిక మధ్యలో ఉన్న బీజేపీ పార్టీ సింబల్ కమలం గుర్తు ను హత్తుకున్నారు. అలా కాసేపు ఆ గుర్తు పైనే ఉండిపోయిన శ్రీనివాస వర్మ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న వర్మకు ఈ టికెట్ దక్కింది. అలా పార్టీ సింబల్ ని పట్టుకొని ఉండిపోయిన శ్రీనివాస వర్మను కార్యకర్తలు ,అభిమానులు బలవంతంగా పైకి లేపాల్సి వచ్చింది. తమ నాయకుడికి టికెట్ రావడంతో పులకించిపోయిన శ్రీనివాస వర్మ అభిమానులు జై బీజేపీ, జై శ్రీనివాసవర్మ అంటూ నినాదాలు చేశారు.