దూసుకెళ్తున్న మైత్రీ
టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్లన్నీ వరుసగా సినిమాలు చేయడంలో సంవత్సరం పొడవునా బిజీగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు. అందుకే సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి ఎక్స్పీరియెన్డ్స్ నిర్మాతలు కూడా మెల్లిగా అడుగులేస్తుండగా దిల్ రాజు లాంటి నిర్మాతలు కూడా ఒక ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కౌంట్ పరంగా దూసుకెళ్తున్నప్పటికీ క్వాలిటీ విషయంలో మాత్రం మెప్పించలేకపోతుంది. వీళ్లందరికీ భిన్నంగా మైత్రీ మూవీ మేకర్స్ ఫాస్ట్ గా, సూపర్ లైనప్ తో వరుస ప్రాజెక్టులతో క్రేజీగా ముందుకు వెళ్తుంది. ఈ ఏడాది ఆగస్ట్ 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ బిజినెస్ జరుగుతుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది. జూ. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇంకొద్ది నెలల్లో కొలిక్కి వచ్చేస్తుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమాలో భాగస్వామ్యంతో పాటూ సుకుమార్ తో తీయనున్న సినిమాకు సోలో బ్యానర్ గా వ్యవహరించనుంది.
ప్రభాస్- హను రాఘవపూడి సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇవి కాకుండా తమిళ, మలయాళంలో కూడా డెబ్యూలు జరుగుతున్నాయి. సన్నీ డియోల్ తో హిందీ ప్రాజెక్ట్ సెట్ అయింది. మరోవైపు టీవీ సీరియల్ నిర్మాణంలో కూడా మైత్రీ అడుగేసింది. వీటితో పాటూ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా మైత్రీ సంస్థ అడుగుపెట్టింది. ఇలా మొత్తానికి టాలీవుడ్ లో మైత్రీ నిర్మాణ సంస్థ దూసుకెళ్తుంది.