ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పవన్ ని కలుస్తున్న ఎంపీలు.. దీని వెనుక మర్మం ఏమిటో?

పవన్ ని కలుస్తున్న ఎంపీలు.. దీని వెనుక మర్మం ఏమిటో?

పొత్తులో భాగంగా చాలా వరకు త్యాగం చేసిన పార్టీ జనసేన. ఈ నేపథ్యంలో పార్టీలో ఎన్నో అంతర్గత అసంతృప్తులు తలెత్తుతున్నాయి. అయినా పవన్ పైన ఉన్న గౌరవంతో చాలామంది సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ అధినేతను కలవడం చర్చనీయాంసంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం తన కుమారుడు మా గుంట రాఘవతో కలిసి పవన్ కళ్యాణ్ను మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మాగుంట కలిశారు. ఇటీవల మాగుంట వైసీపీ కు రాజీనామా చేసి పసుపు తీర్థం పుచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన వరప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈయన కొద్దిరోజుల క్రితం వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి బిజెపిలో చేరారు. పవన్ తో భేటీ అయిన వరప్రసాద్ తాజా రాజకీయ పరిస్థితుల గురించి, పొత్తు నేపథ్యంలో పాటించాల్సిన సమన్వయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇలా వరుసగా పవన్ ను ఒకరి తర్వాత ఒకరు ఎంపీలు కలవడం వెనుక మరేదో మర్మం ఉంది అని భావిస్తున్నారు వైసీపీ శ్రేణులు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :