ఎమ్మెల్సీ కవితకు షాక్.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషయల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడిరచారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకు ఈ రిమాండ్ కొనసాగనుంది. దీంతో ఆమెను తిహాడ్ జైలుకు అధికారులు పంపారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చెపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.