ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రజాశాంతి పార్టీ కొత్త బాధ్యతలు బాబు మోహన్ కి అప్పగించిన పాల్.

ప్రజాశాంతి పార్టీ కొత్త బాధ్యతలు బాబు మోహన్ కి అప్పగించిన పాల్.

ఎన్నికల హై టెన్షన్ మధ్య తన కామెడీతో ఎప్పటికప్పుడు అందరిని ఎంటర్టైన్ చేసే వ్యక్తి కేఏ పాల్. ఇప్పుడు లేటెస్ట్ గా పాల్ ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ ను నియమించారు. హైదరాబాదులో నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజల కోరిక మేరకు తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుంది అని పాల్ తెలిపారు. తమ పార్టీ తరఫున తొలి అభ్యర్థిగా వరంగల్ స్థానానికి గాను బాబు మోహన్ ను ప్రకటించామని.. బాబు మోహన్ లాంటి లీడర్ తమ పార్టీలో చేరాక చాలామంది తమ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని పాల్ అన్నారు. బీజేపీ కేంద్రంలో పవర్ లో ఉండొచ్చు కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి ఓటు బ్యాంకు లేదని పాల్ అన్నారు. ఇటు తెలంగాణలో రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీపై కూడా పాల్ విమర్శలు సంధించారు. వందేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిందని.. వాళ్ల హయాంలో విద్యుత్ కోతలు తప్ప ఎటువంటి ప్రగతి లేదని విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :