హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ఆవరణలోని ఫస్ట్ కోర్టు హాల్లో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే రపమాణ స్వీకారం చేయించారు. మధ్య ప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ సుజోయ్ పాల్ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీముర్మును ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జస్టిస్ సుజోయ్ పాల్ కుటుంబసభ్యులతోపాటు, హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Tags :