సైకిల్ ఎక్కి చంద్రముఖి లక లక అంటుంది.. జగన్ సినిమాటిక్ డైలాగ్స్..
ఎన్నికల దగ్గర పడిన ఈ తరుణంలో మొత్తానికి పరదాలు వదిలి ప్రజల మధ్యకు వచ్చాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వచ్చి రావడంతోటే సినిమా డైలాగులు చెబుతూ చంద్రబాబు నాయుడు పై విమర్శలు కురిపించారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబును ఎన్నుకుంటే.. చంద్రముఖి సైకిల్ ఎక్కి లక లకమంటూ వచ్చి రక్తం తాగుతుంది అని హెచ్చరించారు. ప్రొద్దుటూరులో జరిగిన సభలో సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును చంద్రముఖి తో పోలుస్తూ.. ఓ రేంజ్ లో సినిమా డైలాగులు వదిలారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని.. అతని నమ్మితే ఉన్న పథకాలు కూడా ఊడ్చి పెట్టుకుపోతాయని హెచ్చరించారు. తనపై చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి దుష్ప్రచారాలు చేస్తున్నారని.. ఇప్పుడు వాళ్లతో బీజేపీ నేతలు కూడా కలిశారని జగన్ అన్నారు. మోసాలు చేసే కూటమిని నమ్మితే ప్రజలు మోసపోతారని.. జనం కోసం ఇప్పటివరకు తాను 130 సార్లు బటన్ నొక్కానని.. తన కోసం ప్రజలు రెండు బటన్లు నొక్కితే చాలని జగన్ అన్నారు.