ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జగన్ ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా నిన్ను ఎవరూ ఖాతరు చేయరు.. నారా లోకేష్

జగన్ ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా నిన్ను ఎవరూ ఖాతరు చేయరు.. నారా లోకేష్

ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో రోజురోజుకీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ ఒకపక్క అయితే మిగిలిన ప్రతిపక్షాలు అన్ని మరోపక్క అన్నట్లు ఉంది పరిస్థితి. మాటకు మాట తూటాల్లాగా పేలుతున్నాయి. విమర్శలు ..ప్రతి విమర్శలతో డైలీ సీరియల్ కన్నా.. నేతల ముచ్చట్లే రంజుగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టడానికి అధికార పార్టీ సిద్ధం సిద్ధం అంటూ సిద్ధం చేసిన గిఫ్ట్స్ పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. రేణిగుంటగూడెంలో తాజాగా సిద్ధం చేసిన చేతిగడియారాలు, స్పీకర్లు మొదలైన 52 రకాల వస్తువులు అధికారుల చేతికి దొరికాయి. వీటిపై తాజాగా స్పందించిన నారా లోకేష్.. ఐదేళ్ల అరాచక పాలనతో విపరీతంగా దోచుకొని ఇప్పుడు తాయిలాలతో మభ్యపెట్టడం ఎలా కుదురుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు అతన్ని తాడేపల్లి పాలస్కే పరిమితం చేయాలని భావిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఓటర్లను ఏం మార్చే ప్రయత్నంలో అధికార పార్టీ రెచ్చిపోతోందని.. రేణిగుంటలో చెవిరెడ్డి సిద్ధం చేసిన తాయిలాల డంప్‌ను టీడీపీ ఫిర్యాదు పైనే పట్టుకున్నారని ఆయన చెప్పారు. మరోపక్క జగన్ ఎన్నికల కోసం రెడీగా ఉంచిన ధనం రాశులను ఎప్పుడు పట్టుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ ఇంటికి కేజీ బంగారం పంచిన ఎవరు అతని సపోర్ట్ చేయరు అని లోకేష్ ఎద్దేవా చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :