బీజేపీ కు టికెట్ ఇచ్చిన టీడీపీ.. భగ్గుమంటున్న అనపర్తి...
ఎన్నికల వేడికంటే కూడా టీడీపీ లో పొత్తుల చిచ్చు తారాస్థాయి లో కనిపిస్తోంది. నిన్న అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ నేతను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఒక్కసారి అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి అనపర్తి నుంచి టికెట్ నిరాకరించడంతో తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు భగ్గుమన్నాయి. ఆయన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు మద్దతు తెలియపరుస్తూ భారీగా క్యూ కట్టారు. టీడీపీ పార్టీకు సంబంధించిన కరపత్రాలను, ఫ్లెక్సీలను తగలబెట్టిన కార్యకర్తలు.. సైకిల్ ని కూడా మంటల్లో వేసి తమ నిరసన తెలియపరిచారు. నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో అనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్లమిల్లి కు టికెట్టు రానందుకు నిరసన ప్రకటిస్తూ ఓ అభిమాని ఆయన ఇంటి మీదకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కార్యకర్తలు అతని వెంటనే అడ్డుకున్నారు. మరోపక్క నల్లమిల్లికి టికెట్టు రాకపోతే రాజీనామా చేయడానికి సిద్ధం అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. నల్లమిల్లి మాత్రం అధిష్టానంతో చర్చలు జరుపుతున్నానని.. ఇటువంటి సమయంలో సంయమనం పాటించాలని కార్యకర్తలను కోరారు. పొత్తుల వల్ల గెలవచ్చు అనుకున్న బాబుకి సొంత ఇంటి చిచ్చులు మరింత ఇబ్బందిగా మారుతున్నాయి.