అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ భారీ మొత్తంలో పంచడం కోసం నిల్వ చేసిన చీరలు ,వాచీలు వంటివి దొరకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.అనంతపురం జిల్లాలోని కంబదూరు మండలం సమీపంలో అంతరాష్ట్ర కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ లో గురువారం నాడు తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రాలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్రమంగా మద్యం రవాణా కాకుండా ఉండడం కోసం ఇలా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య తెలియపరిచారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన తర్వాత ఆయన రికార్డులను కూడా పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా మద్యం సరఫరా చేసి ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Tags :