టీడీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆయన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి తాడికొండ టికెట్ ఆశించి నిరాశపడిన డొక్కా గత కొన్ని రోజులుగా అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు.
Tags :