కేసుల పరంపరలో కేసీఆర్ కుటుంబం..
నిన్న కాక మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు.. కవిత అరెస్టు అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేతలు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేసి కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఇటువంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న హనుమకొండ పోలీసులు కేటీఆర్ పై జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. మరి దీని పై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags :