ప్రముఖ కవి అందెశ్రీని సత్కరించిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో సన్మానించారు. అందెశ్రీ దంపతులు సీఎం నివాసానాకి వచ్చారు. ముఖ్యమంత్రి ఇరువురితో సమావేశమ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి దంపతులు అందెశ్రీ దంపతులను సన్మానించారు. అలాగే మరో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అశోక్తేజతో పాటు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీతలు అయిన అందె భాస్కర్ ( డప్పు వాయిద్యం), పేరిట నృత్య కళాకారులు పేరిణ రాజ్కుమార్ నాయక్లు కూడా ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి రేవంత్ సన్మానించి అభినందించారు.
Tags :