ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణలో నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణలో నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలో నూతన హైకోర్టు  నిర్మాణానికి రాజేంద్రనగర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. నూతన హైకోర్టు భవానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ అన్నారు.  ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్ర నగర్‌లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మించనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :