కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో తమ అభిమాన నాయకుడిని గెలిపించుకుంటామని స్థానికులు పేర్కొన్నారు. రెండు నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించారు.
Tags :