హైదరాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్
హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ హైదరాబాద్ స్థానాన్ని మాత్రం పెండింగులో ఉంది. నేడు శ్రీనివాస్ యాదవ్ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్లయింది.
Tags :