ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఈ కేసులో ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి : రఘునందన్‌రావు

ఈ కేసులో ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి :  రఘునందన్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రేవంత్‌ రెడ్డిని టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా అరెస్టు చేశారు.  2014 నుంచి వ్యవహారం జరిగినట్టు అర్థమవుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినప్పుడు డీజీపీ, ఎస్‌ఐబీ చీఫ్‌గా ఎవరున్నారు.  గత డీజీపీ పీఏ అధికారిక ఖర్చులతో, కార్యాలయ సిబ్బంది శ్రీనాథ్‌ రెడ్డి అమెరికా ఎలా వెళ్లారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు ఎవరు, ఎప్పుడు ఎలా కొన్నారు? ఈ కేసులో ఇద్దరు అడిషినల్‌ ఎస్పీలను అరెస్టు  చేసి చేతులు దులుపుకొంటామంటే కుదరదు. చిత్తశుద్ధితో విచారణ జరపాలి. ఈ కేసులో మొదటి నిందితుడిగా కేసీఆర్‌, రెండో నిందితుడిగా హరీశ్‌రావు, మూడో ముద్దాయిగా వెంకట్రామిరెడ్డిని పెట్టాలి. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలి అని డిమాండ్‌ చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :