జగన్ సభలో.. మాజీ మంత్రి భూమ అఖిలప్రియ అరెస్ట్..
మేమంతా సిద్ధం బస్సు యాత్ర లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఎర్రగుంట లో ఏర్పాటు చేసిన సీఎం జగన్ తో ముఖాముఖి సభ వద్ద అనుకోకుండా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ కు వినతి పత్రం ఇవ్వడం కోసం అక్కడికి వచ్చిన భూమా అఖిల ప్రియను అనుమతి లేదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సాగునీటి విడుదలకు సంబంధించి సీఎంకు వినతి పత్రాన్ని అందివ్వడానికి భూమ అఖిలప్రియ ఆ సభకు వెళ్లారు. ఆమె వెంట భారీగా టీడీపీ శ్రేణులతో పాటు కార్యకర్తలు, అభిమానులు కూడా తరలివచ్చారు. మాటల యుద్ధం తోపులాట వరకు వెళ్లడంతో.. అప్రమత్తమైన పోలీసులు.. భూమా అఖిల ప్రియను అడ్డుకొని అక్కడ నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం నంద్యాలలో అఖిల ప్రియ అరెస్ట్ తీవ్రమైన కలకలం రేపుతోంది.