నేనూ పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తా
లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్కు విధేయుడైన సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో రెజ్లింగ్లో మరోసారి వివాదం మొదలైంది. ఆయన ఎన్నికను నిరసిస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా, మరో కుస్తీయోధుడు బజ్రంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రముఖ పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా వీరికి మద్దతు ప్రకటించాడు. తన పద్మశ్రీని కూడా వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ దేశ పుత్రిక, నా సోదరి ( సాక్షి మలిక్) కోసం నేను కూడా నా పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తాను. సాక్షి మలిక్ను చూసి నేను గర్వపడుతున్నా. దేశంలోని ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు కూడా దీనిపై తమ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతున్నాం అని వీరేందర్ సింగ్ తెలిపారు. వీరేందర్కు 2021 లో పదశ్రీ పురస్కారం లభించింది.