ASBL NSL Infratech

భారత్ కంపెనీలపై అమెరికా నిషేధం

భారత్ కంపెనీలపై అమెరికా నిషేధం

ఇరాన్‌ సైన్యం తరపున అక్రమ వాణిజ్యం, యూఏవీ బదిలీలను సులభతరం చేసినందుకు భారత్‌కు చెందిన మూడు కంపెనీలలో పాటు మొత్తం 12కు పైగా కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి ఇరాన్‌ మానవరహిత వైమానిక వాహనాల( యూఏవీ)లు రహస్య విక్రయాలను సులభతరం చేయడంలో, ఆర్థిక సహాయం చేయడంలో ఈ కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ప్రధాన పాత్ర పోషించాయని అమెరికా ట్రెజరీ విభాగం తెలిపింది. ఈ ప్రయత్నాలకు మద్దతుగా ఇరాన్‌ వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న  ప్రధాన కంపెనీగా సహారా థండర్‌ను గుర్తించినట్టు తెలిపింది. సహారా థండర్‌కు మద్దతు ఇచ్చినందుకు ఆంక్షలు విధించిన మూడు భారత్‌కు చెందిన కంపెనీలు జెన్‌ షిప్పింగ్‌, పోర్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీ ఆర్ట్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ (ఓపీసీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌పై అమెరికా నిషేధం విధించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :