ఇక లోక్సభ లోనూ బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని లోక్సభలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా గుర్తిస్తూ లోక్సభ సచివాలయం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఇక నుంచి టీఆర్ఎస్ ఎంపీలను బీఆర్ఎస్ ఎంపీలుగా గుర్తించనున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తున్నట్లు గతేడాది అక్టోబరు 5న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గతేడాది డిసెంబరు 8న టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ చేసిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. అనంతరం పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలను బీఆర్ఎస్ ఎంపీలుగా గుర్తించాలని కోరుతూ పార్టీ అధిష్టానం ఉభయ సభాపతులకు లేఖలు రాసింది. రాజ్యాసభలో గతంలోనే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చగా, తాజాగా లోక్సభ సచివాలయం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా గుర్తించింది.
Tags :