విశ్వాస పరీక్షలో నెగ్గిన హరియాణా సీఎం
హరియాణాలో నూతన ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సీఎం పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సైనీ బలపరీక్ష నిమిత్తం శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సీఎం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభలో చర్చ జరిపిన అనంతరం మూజువాణీ ఓటింగ్ చేపట్టారు. 48 మంది ఎమ్మెల్యేల మద్దతులో సైనీ విజయం సాధించారు.
90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలుండగా, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్కు 30, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోక్దళ్, హరియాణా లోక్హిత్ పార్టీకి చెరొక సభ్యుడు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ, మిత్రపక్షం జేజేపీ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.