ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మరోసారి తీర్మానానికి సిద్ధమైన ..స్టాలిన్ ప్రభుత్వం

మరోసారి తీర్మానానికి సిద్ధమైన ..స్టాలిన్ ప్రభుత్వం

అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై భారత సర్వోన్నత న్యాయస్థానాన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమోదం కోసం వచ్చిన పలు బిల్లులను గవర్నర్‌ తిరిగి వెనక్కి పంపించారు. దీంతో వీటిపై మరోసారి తీర్మానం చేసి పంపించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం నవంబర్‌ 18న అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనుంది. అసెంబ్లీ తీర్మానించి పంపిన అనేక బిల్లులను గవర్నర్‌ తిరిగి పంపినట్లు తెలిసింది. వీటిపై మళ్లీ తీర్మానం చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది అని స్పీకర్‌ ఎం అప్పవూ వెల్లడిరచారు. తిరిగి పంపిన బిల్లులను వెంటనే ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఈ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :