భారత్ ఎన్నికల ప్రచారంలో విదేశీ దౌత్యవేత్త
భారత్లో ఎన్నికలు ప్రజలు చేసుకునే పండుగలాంటివని జపాన్ దౌత్యకార్యాలయంలో ద్వితీయ కార్యదర్శిగా ఉన్న మయూమి ట్సుబాకిమోటో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేపట్టిన రోడ్షోలో ముగ్గురు సభ్యుల విదేశీ దౌత్యవేత్తల బృందం పాల్గొంది. వీరిలో భారత్లో ఉన్న ఆస్ట్రేలియన్ హై కమిషన్ ద్వితీయ కార్యదర్శి మిచెల్ రీస్, టాంజానియా హై కమిషన్ విదేశీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రి బజిల్ ల్యాకినానా, జపాన్ దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న మయూమి ట్సుబాకిమోటో ఉన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రత్యక్షంగా గమనించి అధ్యయనం చేసేందుకు వీరు ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయూమి తన అనుభవాలను పంచుకున్నారు. ఇందౌర్లో ప్రధాని నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రజలకు ఎలా చేరువవుతుందో తెలుసుకునేందుకు కొందరు స్థానిక నాయకులతో మాట్లాడాం. భారత్లో ఎన్నికలు ఇక్కడి ప్రజలు చేసుకునే పండుగలాంటివి అని మయూమి తెలిపారు.