ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో వారు చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది.
Tags :