మరోసారి ఎన్నికల బరిలో బర్రెలక్క
శిరీష (బర్రెలక్క) మరోసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆమె నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామాల్లో పర్యటించిన తనకు కొన్ని సమస్యలు కనిపించాయని, ఎంపీ ఎన్నికల్లో తాను గెలిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు చాలా దుర్భరంగా ఉన్నాయని అన్నారు. నిరుద్యోగుల ప్రతినిధిగా ఈ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.
Tags :