నేను ప్యాకేజీ తీసుకొని స్టెప్పులు వేసే రకం కాదు.. అంబటి రాంబాబు
ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా నేతలు పలు రకాల ఇంటర్వ్యూలు, ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కూడా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి ఎదురు దెబ్బ తగలడంపై ప్రశ్నించారు. దానికి సమాధానం ఇచ్చిన అంబటి ఎమ్మెల్సీ ఎన్నికలు పరోక్ష ఎన్నికలని.. అక్కడ వ్యక్తుల ప్రభావం ఉంటుంది అని స్పష్టం చేశారు. కానీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల విషయంలో అలా ఉండదని.. ఇవి ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనే ఎన్నికలు కాబట్టి తమ పార్టీపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. మాటల మధ్యలో అంబటి స్టెప్పులు, డాన్సులు గురించి ప్రస్తావన వచ్చింది. దీనికి స్పందించిన అంబటి రాంబాబు.. అది డిఫరెంట్ మ్యాటర్.. నేను పవన్ కళ్యాణ్ లాగా ఎక్కడపడితే అక్కడ రోజు స్టెప్పులు వేస్తానా ఏంటి. ప్యాకేజీ తీసుకొని మరి స్టెప్పులు వేసే అలవాటు నాకు లేదు.. సంక్రాంతికి నేను చేసింది ఆనంద తాండవం.. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం అని అన్నారు.