అలీబాబా గుడ్ న్యూస్ .. 15 వేల మందిని
ఆదాయం తగ్గడం, ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ట్విట్టర్, ఐబీఎం, హెచ్పీ సహా మరిన్ని దిగ్గజ సంస్థలు వేలాది ఉద్యోగులను తీసేశాయి. వందలాది సంస్థలు ఉద్యోగాలను లేఆఫ్స్ చేశాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇలాంటి సమయంలో చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ నిరుద్యోగులకు గూడ్న్యూస్ చెప్పింది. భారీ స్థాయిలో ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ తన ఆరు ప్రధాన వ్యాపార విభాగాలన్నింటిలో కలిపి ఈ ఏడాది ఏకంగా 15,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ విబో ద్వారా ఈ విషయాన్ని వెల్లడింది. తాజా నియామకాల్లో ఫ్రెషర్స్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది.కొత్త నియామాకాల్లో 3,000 మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేయనున్నట్లు వెల్లడించింది.