ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

‘ఆచార్య’ ధర్మస్థలి సెట్‌ ఎలా అంటుకుందంటే? .. సిగరెట్‌ కాల్చి వేసారంటా!

‘ఆచార్య’ ధర్మస్థలి సెట్‌ ఎలా అంటుకుందంటే? .. సిగరెట్‌ కాల్చి వేసారంటా!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ కోసం ధర్మస్థలి ఆలయం సెట్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆలయం సెట్‌కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తుండగా.. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి  కాంబినేషన్‌లో ‘ఆచార్య’  మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషించగా.. గతేడాది విడుదలైన ఈ చిత్రం బిగ్టెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ మొత్తం ధర్మస్థలి టెంపుల్  నేపథ్యంలో ఉంటుంది. ఇందుకోసం ఆచార్య టీమ్ షూటింగ్ టైమ్‌లో భారీ టెంపుల్ సెట్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఆ టెంపుల్ సెట్‌కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెట్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా చూపుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫైర్ ఇన్సిడెంట్‌ను కొందరు వీడియో తీశారు.

మెయిన్ ఎంట్రన్స్ వద్ద కూర్చొని ఎవరో సిగరెట్ కాల్చారని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్‌లో మంటలు చెలరేగాయని దీన్ని రికార్డ్ చేసిన వ్యక్తులు మాట్లాడుకుంటుండటం వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతోంది. మొత్తానికి మంటలు భారీగానే చెలరేగి సెట్ మొత్తం కాలిపోతున్నట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాదు దగ్గరలో నీళ్లు కూడా అందుబాటులో లేవని, మంటలు పూర్తిగా వ్యాపించకముందే ఫైర్ ఇంజన్‌కు ఫోన్ చేయండని చర్చించుకోవడం కూడా ఇందులో వినిపిస్తోంది. హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో సుమారు 20 ఎకరాల్లో ఈ సెట్ వేశారు. సురేష్ సెల్వరాజన్ నిర్మించిన ఈ సెట్‌కు దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకు నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి సైతం డైరెక్టర్ కొరటాల శివ పట్ల తన అసంతృప్తిని పలు వేదికలపై ఇన్‌డైరెక్ట్‌గా వెల్లగక్కిన సంగతి తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :