ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

13 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న 'వైశాలి' కాంబో...

13 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న 'వైశాలి' కాంబో...

ఆది పినిశెట్టి, అరివగజన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'ఈరమ్' కోలీవుడ్ లో ఎంత సక్సెస్ సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాని తెలుగులో 'వైశాలి' టైటిల్ తో డబ్ చేసారు. తెలుగులో కూడా ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి విజయం సాధించింది. సినిమా ఆధ్యంతం ఎన్నో మలుపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంది.

రెగ్యులర్ థ్రిల్లర్ మూవీస్ కి భిన్నంగా వైశాలి మూవీ ని చిత్రీకరించారు దర్శకుడు. అందుకే శంకర్ లాంటి లెజెండ్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. హీరోగా నటించిన ఆదికి మంచి పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. నందా దొరై రాజ్, సింధు మీనన్ పాత్రలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఇలాంటి సక్సెఫుల్ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తే బాగుండేది అని అనుకున్నారు. అంత మంచి టాక్ ని తెలుగు, కన్నడ భాషల్లో సొంతం చేసుకుంది.

తాజాగా దర్శకుడు అరివగజన్ ఆదితో మరో చిత్రాన్ని ప్రకటించారు. 'శబ్దం' అనే టైటిల్ తో మరో హారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆది పుట్టినరోజు  సందర్భంగా సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో  గబ్బిలాలు ఓ భారీ  చెవిలోకి ప్రవేశించడం. వింతైన గబ్బిలాల శబ్దం..ప్రతిధ్వనులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్ గా పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతుంది. సినిమాకి సంబంధించి పనులు మొదలైనట్లు తెలుస్తోంది.

7G ఫిల్మ్స్ - ఆల్ఫా  ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ని  నిర్మిస్తున్నాయి. వైశాలి సినిమాకి  సంగీతం అందించిన ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి కూడా  సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్  హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. తెలుగు-తమిళంలో ఒకేసారి ఈ చిత్రం ప్రారంభం కానుంది. మొత్తానికి ఈ కాంబో మళ్ళీ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ని ప్రేక్షకులకి అందించడానికి రెడీ అయ్యింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :