ASBL NSL Infratech

మీరు చూపించిన నిబద్ధత, అంకిత భావం మరిచిపోలేనిది: వైఎస్ జగన్

మీరు చూపించిన నిబద్ధత, అంకిత భావం మరిచిపోలేనిది: వైఎస్ జగన్

ఆమరణదీక్ష చేస్తున్న వైయస్సార్‌సీపీ ఎంపీలు మిథున్, అవినాశ్‌లతో వెయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌. రాష్ట్రం గర్వపడేలా మీరు ఆమరణదీక్ష  చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి గర్విస్తున్నారు. ఐదు మంది వైయస్సార్‌సీపీ ఎంపీల పోరాటాన్ని ప్రజలు జీవితకాలంలో మరిపోలేరు. మీరు చూపించిన నిబద్ధత, అంకిత భావం మరిచిపోలేనిది. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ పోరాటానికి నా అభినందనలు. పోరాటాలద్వారా ఒత్తిడి తీసుకురావాలన్నదే మన ఉద్దేశం. రాష్ట్రంలో పోరాటం కొనసాగించడంకోసం కార్యాచరణ రూపొందించుకున్నాం. ఎంపీలకు సంఘీభావం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికోసం రహదారి దిగ్బంధనాల సహా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన పోరాటాలను భగవంతుడు చూస్తున్నాడు, తప్పకుండా మేలు చేస్తాడు. నిరాహారదీక్షలు ఎంత కష్టపడి చేశారో... ఇప్పుడు మాకు తెలుస్తోంది. 

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో ఎంపీ మిథున్‌ రెడ్డి
నాది అలవాటైన ప్రాణం. మీరు నిరాహారదీక్ష చేపట్టి ఐదురోజులు అయ్యింది. 4 రోజులుగా ఆహారం తీసుకోకుంటే.. కీటోన్స్‌ శరీరంలో పెరుగుతాయి. నీళ్లుబాగా తాగి డ్రీ హైడ్రేషన్‌ కాకుండా చూసుకోండి. పోరాటాన్ని ఆపేదిలేదు.. కొనసాగిస్తామన్న ఎంపీ అవినాశ్‌ రెడ్డి
మీరు కూడా ఎండల్లో ఉన్నారు.. జాగ్రత్తగా ఉండాలంటూ వైఎస్‌ జగన్‌కు ఎంపీల సూచన

 

Tags :