ASBL NSL Infratech

200వ రోజు పాదయాత్ర సందర్భంగా ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్

200వ రోజు పాదయాత్ర సందర్భంగా ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్

200వ రోజు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు వైఎస్‌జగన్‌ కృతజ్ఞతలు. పాదయాత్ర చేయగలుగుతామా? అన్న పరిస్థితులనుంచి సునాయాసంగా ముందుకు సాగగలుగుతున్నాం. దేవుడి దయ, ప్రజల దీవెన వల్లే ఇది సాధ్యం. ప్రతి అడుగులోనూ నాన్నగారు తోడుగా ఉండి నడిపిస్తున్నట్టు ఉంది. వేసే ప్రతి అడుగులోనూ ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల ఆప్యాయతలు, ప్రేమానురాగాలు ఈ 200రోజులుపాటు నన్ను నడిపించగలిగాయి. దారిపొడవునా చూసిన సమస్యలు నాకు బాధకలిగించాయి. రుణాలు మాఫీ కాక, గిట్టుబాటు ధరలు రాక రైతులు ఇబ్బందిపడుతున్నారు. రైతులను ప్రభుత్వం మోసం చేసింది. విద్యార్థులు నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఫీజురియింబర్స్‌మెంట్‌ రాక ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అన్న పరిస్థితిని చూసి పేదలు అవస్తలు పడుతున్నారు. ఇళ్లులేక పూరిగుడిసెల్లోనే పేదలుఉంటున్నారు. ఇలా ఏ సమస్య చూసినా మనసును కలిచివేసే సన్నివేశాలు నాకు పాదయాత్రలో కనిపించాయి.

ప్రభత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంవల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయి. ప్రజలకు మంచిచేయాలన్న ఆలోచన ఇప్పటి ప్రభత్వానికి లేదు. దేవుడు ఆశీర్వదిస్తే, కోట్లమంది ప్రజలు దీవిస్తేనే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అలాంటి సీట్లో కూర్చున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలన్నదానిపై ఇప్పటి ముఖ్యమంత్రికి ఆలోచనలు కరువయ్యాయి. ఇక రేపు లేదు అన్నట్టుగా సీఎం సీట్లో ఉన్న వ్యక్తి ప్రజలకోసం పరితపించాలి. మనం చనిపోయాక ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడాలి. కాని అలాంటి పాలన ఇప్పుడు కనిపించడంలేదు. ఈ పరిస్థితులను చూసి నా మనసు చలించిపోతోంది. వచ్చే మంచి రోజులుగురించి పాదయాత్రలో ప్రజలకు భరోసా నిచ్చాం. నవరత్నాలు వస్తాయి, రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చాం. ప్రజలు ఆరోజుకోసం చూస్తున్నారు. 200 రోజులపాటు ప్రజలు చూపిన ప్రేమాభిమానాలను మరిచిపోలేను.

నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను. నాన్నగారి పాలన, అంతకన్నా గొప్ప పాలన ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి, ప్రేమ, ఆప్యాయతలు నన్ను 200 రోజులు నడిపించాయి. ఇంకా ఇచ్ఛాపురం వరకూ ప్రజాసంకల్ప యాత్ర పోవాలి. 

దీనికి ముందడుగు.. ప్రజల ఆశీర్వదంతోనే పడుతుంది: వైఎస్‌ జగన్‌

 

Tags :