ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎపికి వస్తున్న మరో అమెరికా కంపెనీ

ఎపికి వస్తున్న మరో అమెరికా కంపెనీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అమెరికా పర్యటనలో భాగంగా పలువురిని కలుసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై ఆయన ఇస్తున్న ప్రజంటేషన్‌ చాలామందిని ఆకట్టుకుంటోంది. మరోవైపు ఎపిఇడిబి కూడా పెట్టుబడులను ఆకట్టుకోవడానికి రాష్ట్రంలో లభ్యమయ్యే వనరులపై, ఇతర విషయాలపై పెట్టుబడిదారులకు అవగాహనను కల్పిస్తోంది. దాంతో చాలామంది తమ కంపెనీలను ఎపిలో పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు సౌర బ్యాటరీలు చెందిన ప్రాజెక్ట్‌ వైపు దృష్టి సారించింది. సౌర విద్యుత్‌ పరికరాల తయారీ లో పేరున్న ట్రైటన్‌ సోలార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల బదంతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు ఏర్పాటు కు ఆ సంస్థచైర్మన్‌ హిమాంశు పటేల్‌, మేనేజింగ్‌ పార్టనర్‌ నంద శాండిల్య - పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణకిషోర్‌ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది.

ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు వంద మిలియన్ల యూఎస్‌ డాలర్లు అంటే సుమారు 727 కోట్ల 84 లక్షల రూపాయలు అంచనాతో పెట్టుబడిని దశలవారీగా పెడతామని ట్రైటన్‌ సోలార్‌ సంస్థ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరం అవుతుందని ఆ సంస్థ ప్రతిపాదించింది. ఈ సౌర బ్యాటరీని తయారు చేయడానికి నానోటెక్నాలజీ - లిథియం పాలిమర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, దీనిలో భాగంగా సౌర బ్యాటరీలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.

 

Tags :