ASBL NSL Infratech

ఆటా తెలంగాణ మహాసభలకు వస్తున్న సినీ తారలు

ఆటా తెలంగాణ మహాసభలకు వస్తున్న సినీ తారలు

అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలోజూన్‌ 29 నుంచి జూలై 1 వరకు హ్యూస్టన్‌లోని జార్డ్‌ ఆర్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభల పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, కళాకారులు హాజరవుతున్నారు. హీరోలు నితిన్‌, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా, పూజా హెగ్దె, లావణ్య త్రిపాఠీ, షాలినీ పాండే, రాధా బంగారు, ధాన్యా బాలకృష్ణణ్‌, ఉదయభాను, సత్యం రాజేష్‌, బిత్తిరి సత్తి తదితరులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. గాయనీ గాయకులు మధు ప్రియ, పార్థసారధి నేమాని, రాము, కార్తీక్‌, సాయి చందు, వందేమాతరం శ్రీనివాస్‌, గోరెటి వెంకన్న తదితరులు వేడుకలకోసం టెక్సాస్‌ వస్తున్నారు. పోసాని మురళీ కృష్ణ, రాజేష్‌, శివమణి తదితరులు కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు. 

రాజకీయరంగం నుంచి తెలంగాణ మంత్రులు అజ్మీరా చందూలాల్‌, పోచారం?శ్రీనివాస్‌, ఆళ్ళ ఇంద్రకరణ్‌ రెడ్డి, పార్లమెంట్‌ సభ్యుడు జితేందర్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మధుగౌడ్‌ యాష్కి, ఎం. కోదండ రెడ్డి, డా. వినయ్‌ భాస్కర్‌, అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌. మధుసూధనాచారి, ఎస్‌. వేణుగోపాలచారి తదితరులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు.

వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్యతోపాటు నందినీ సిదారెడ్డి, మేడసాని మోహన్‌, గజం అంజయ్య, డా. సునీతాకృష్ణన్‌ తదితరులు కూడా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

 

Tags :