ASBL NSL Infratech

టిఫాస్ ఉగాది వేడుకలకు భారీ ఏర్పాట్లు

టిఫాస్ ఉగాది వేడుకలకు భారీ ఏర్పాట్లు

న్యూజెర్సిలోని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్‌ 28వ తేదీన జరిగే ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. టాలీవుడ్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. న్యూజెర్సి స్టేట్‌ సెనెటర్‌ విన్‌ గోపాల్‌, గాయకుడు మల్లిఖార్జున్‌, గాయని గోపిక సంగీత విభావరితోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించనున్నారు. మనోజ్‌ ఇరువూరి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

 

Tags :