పిడుగురాళ్ళలో 'తానా' రైతు కోసం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీన గుంటూరు జిల్లాలలోని పిడుగురాళ్ళలో రైతుకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తానా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన రక్షణ పరికరాలను తానా అందజేస్తోంది. నేల, పంటకు సంబంధించి వారిని చైతన్యపరిచేలా శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. డిసెంబర్ 17న మాచర్లలో కూడా రైతుకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Tags :