ASBL NSL Infratech

ఇండియా బిజినెస్ సెషన్ లో మంత్రి నారా లోకేష్

ఇండియా బిజినెస్ సెషన్ లో మంత్రి నారా లోకేష్

ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు రెండు రోజు కార్యక్రమాల్లో బిజినెస్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ సమావేశం ప్యానెల్‌ డిస్కషన్‌లో మంత్రి లోకేష్‌ మాట్లాడారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్‌, సోలార్‌ రంగాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖ-చెన్నై, బెంగళూరు- చెన్నై కారిడార్లు వస్తున్నాయన్నారు. నీటి వనరులు కల్పించడం వల్ల అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ, ఆటోమొబైల్స్‌ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. దావోస్‌ సదస్సు రెండోరోజు కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌, నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, శోభనా కామినేని, సీఐఐ ప్రతినిధి చంద్రజిత్‌ బెనర్జీ పాల్గొన్నారు.

 

Tags :