ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలుగు సాహిత్యంలో భిన్న ధృక్పథాలు

తెలుగు సాహిత్యంలో భిన్న ధృక్పథాలు

నాటా కన్వెన్షన్‌లో భాగంగా ఫిలడెల్పియాలో ఏర్పాటు చేసిన 'తెలుగు సాహిత్యంలో భిన్న ధృక్పథాలు' సెషన్‌లో వక్తల ప్రసంగాలతో పాటు, పుస్తాకావిష్కరణలు, స్వీయకవితా పఠనం జరిగాయి. రచయిత్రి కల్పనా రెంటాల అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో విక్రమసింహపురి విశ్వ విద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసి రిటైరైన సీఆర్‌ విశ్వేశ్వర రావు ఇంగ్లీష్‌ లోవచ్చిన తెలుగు అనువాదాల గురించి ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. పుట్టపర్తి వారి అభ్యుదయ వాదం గురించి వారి కుమార్తె, విదుషీమణి పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి వారి మహోన్నత వ్యక్తిత్వం పరిచయం చేశారు.

ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణికి రచయిత్రి కల్పనరెంటాల నివాళి ప్రసంగం చేశారు. యడ్లపల్లి భారతి 'ఎడారి బతుకులు' వడ్డేపల్లి కృష్ణ తెలుగు కవిత్వానికి ఇంగ్లీష్‌ అనువాదాల పుస్తకం, తదితర పుస్తకావిష్కరణలు జరిగాయి. నాటా సాహిత్య కమిటీ చైర్‌ మెట్టుపల్లి జయదేవ్‌, తిమ్మాపురం ప్రకాష్‌ ఆధ్వర్యం లో జరిగిన ఈ సెషన్స్‌ సాహిత్యాభిమానులను అలరించాయి.

 

Tags :