భారత్ పర్యటన పట్ల ఇవాంకా హర్షం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారురాలు ఇవాంక ట్రంప్ కూడా ఆయన వెంట భారత్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో ఆమె హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మోదీతో కలిసి పాల్గొన్నారు. ప్రపంచంలోని రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న గొప్ప స్నేహాన్ని వేడుకగా జరుపుకునేందుకు రెండేండ్ల తర్వాత కుటుంబంతో కలిసి తిరిగి భారత్కు రానుండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అని ట్వీట్ చేశారు.
Tags :