చంద్రబాబుతో డ్యూర్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
స్విస్ బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్న, సైబర్ సెక్యూరిటీ రంగంలో విశేష అనుభవం కలిగిన డ్యూర్ టెక్నాలజీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీల వైపు వేగంగా వెళుతున్న భారత్లో సైబర్ సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. ఈ నేపథ్యంలో జూరిచ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి డ్యూర్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ఆసక్తిని తెలియజేశారు.
Tags :