ASBL NSL Infratech

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు విహంగ వీక్షణం

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు విహంగ వీక్షణం

రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విహంగ వీక్షణం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో శంకుస్థాపన జరిగే ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సీఆర్‌డీఏ భూముల్లో పవిత్ర మట్టి-పుణ్యజలాల మిశ్రమాన్ని అకాశమార్గం నుంచి అమరావతి ప్రాంతంలో చల్లారు.  ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాలు, దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, మహానుభావుల జన్మస్థలాల నుంచి నీరు, మట్టిని సేకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పవిత్రమైన నీరు, మట్టిని అమరావతిలో చల్లడం ద్వారా ఈ ప్రాంతమంతా శక్తిమంతమవుతుందని చెప్పారు.

Tags :