ఐరాస వేదికపై తెలుగులో ప్రసంగించిన చంద్రబాబు
న్యూయార్క్లోని ఐరాస వేదికపై ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు ఏర్పాటు చేసిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలుత తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన తెలుగు పలుకులకు సభికులు హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ భారతీయుల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు...ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారింది. ఇది ప్రపంచానికే ఆదర్శం అని తన ప్రసంగాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
Tags :