ASBL NSL Infratech

దావోస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం

దావోస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం

దావోస్‌లో `ప్రపంచ ఆర్థిక వేదిక' (వరల్‌‌డ ఎకనామిక్‌ ఫోరమ్‌) 47వ వార్షిక సదస్సు ఈనెల 17 నుంచి 20 వరకు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొని ఫలవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు డబ్లూఈఎఫ్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తరపున ఫిలిప్‌ రోజియర్‌ (బోర్డు మెంబర్‌) నవంబరులోనే లేఖ రాశారు. `ప్రపంచ ఆర్థిక వేదిక' సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఇలా ఆహ్వానం అందుకోవడం ముఖ్యమంత్రికి ఇది వరుసగా మూడోసారి. `బాధ్యతాయుతంగా స్పందించే నాయకత్వం' అనే ఇతివత్తంతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రతినిధి బందం పాల్గొననుంది. 

Tags :