ASBL NSL Infratech

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం

రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచారనిమిత్తం వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రి శిద్ధ, ఎంపీ టిజి వెంకటేష్‌, టిడిపి జిల్లా అధ్యక్షుడు సొమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్యుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టిజి భరత్‌ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎప్పటినుంచో మీరు కార్పొరేషన్‌ అడుగుతున్నారు. ఇందుకు సుముఖతను సంవత్సరం క్రితమే వ్యక్తం చేయడం జరిగిందన్నారు. శిద్ద తనతో చెప్పారని, నంద్యాల ఉప ఎన్నిక కాగానే విధివిధానాలకు రూపకల్పన చేసి కార్పోరేషన్‌ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.  

Tags :