ASBL NSL Infratech

ముఖ్యమంత్రితో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ భేటీ

ముఖ్యమంత్రితో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ భేటీ

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) చైర్మన్ కేవీ కామత్ ముఖ్యమంత్రిని కలిసారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి గల అవకాశాలను పరిశీలించేందుకు త్వరలో ఒక బృందాన్ని పంపిస్తామని కామత్ తెలిపారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులే కాకుండా చైనీస్ ఫండ్‌ను కూడా సమకూర్చే అవకాశాలున్నాయని అన్నారు. చైనా సాంకేతికతను సైతం అందిస్తామని చెప్పారు. చైనా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సహకరించాలని కామత్‌ను ముఖ్యమంత్రి కోరారు. 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్ర్రపదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన వనరులు, ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిషోర్ తదితరులు వున్నారు.

 

Tags :