అమరావతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన పల్లె రఘునాథరెడ్డి
అమెరికాలో 12 సంవత్సరాలకుపైగా ప్రచురితమవుతున్న ఎన్నారైల తొలి తెలుగు పత్రిక 'తెలుగు టైమ్స్' ప్రచురించిన 'అమరావతి' ప్రత్యేక సంచికను రాష్ట్ర సమాచార, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అమరావతిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆవిష్కరించారు. అమరావతి రాజధాని శంకుస్థాపను పురస్కరించుకుని 'తెలుగు టైమ్స్' ఈ ప్రత్యేక సంచికను వెలువరించినట్లు పత్రిక ఎడిటర్, మేనెజింగ్ డైరెక్టర్ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు.
Tags :