షర్మిల కు ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు కౌంటర్ ..
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న టైం లో షర్మిల తన అన్న జగన్ ను టార్గెట్ చేసి వికృత రాజకీయ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత ఉంది అన్న విషయం ప్రజలకి కూడా తెలుసు. సాక్షాలు ఉన్నప్పటికీ జంకు బంకు లేకుండా.. జగన్ పై లేని పోనీ నిందలు వేస్తూ అదే ప్రచారంగా భావిస్తుంది షర్మిల. పదే పదే ఒకే అబద్దాన్ని చెప్పిన నమ్మడానికి ప్రజలు అమాయకులు కారు అన్న విషయం ఆమె గమనించుకోవడం లేదు. ఇలా అసత్యాలతో జగన్ పై నిందలు వేయడం మంచిది కాదు అని ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి షర్మిలపై మండిపడ్డారు. షర్మిల తన రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ ను టార్గెట్ చేసి.. ఆయనే కావాలని వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్పించారని.. కాంగ్రెస్ పార్టీకి ఈ విషయానికి సంబంధం లేదని మాట్లాడారు. బహిరంగ సభలో షర్మిల ఇలా సొంత అన్న పై నిందలు వేయడం తో లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు.
వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో జగన్ చేర్పించారని షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు. ఆనాడు వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చటానికి ముఖ్య కారణం కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు అని స్పష్టం చేశారు. శంకర్రావు హైకోర్టుకి రాజశేఖర్ రెడ్డి పై ఆరోపణలు చేస్తూ లేఖ రాశారని.. ఆ లేఖ కారణంగానే విచారణ మొదలయిందని ఆయన వెల్లడించారు. ఈనాడు తనకి పదవులు ఇస్తున్నారు కదా అని ఆ పార్టీని వెనక వేసుకు వచ్చి ఇలా అన్న మీద నిందలు వేయడం సబబు కాదని ఆయన వ్యాఖ్యానించారు.