తమ్ముడి కోసం ప్రచారంలోకి దిగిన మెగాస్టార్.. వీడియో తో పిఠాపురం ప్రజలకు ప్రత్యేక విన్నపం
ఏపీలో ఎన్నికలు జరగడానికి గట్టిగా వారం రోజుల వ్యవధి కూడా లేదు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడి కోసం ఎట్టకేలకు మెగాస్టార్ కూడా ప్రచారంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించాల్సిందిగా పిఠాపురం వాస్తవ్యులను ప్రత్యేకమైన వీడియో ద్వారా మెగాస్టార్ కోరుకున్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మాద్దతుగా మెగాస్టార్ ఎక్స్ వేదికగా వీడియోస్ సందేశాన్ని విడుదల చేశారు. అందులో మెగాస్టార్ ఏమన్నారంటే..’మా అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినప్పటికీ.. మంచి చేయడానికి మొదటి వాడిగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. తన గురించి కంటే కూడా జనం గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. అటువంటివాడు రాజకీయాలలో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోగలడు.
ఎవరైనా అధికారంలోకి వచ్చాక సహాయం చేస్తారు.. కానీ కళ్యాణ్ అలా కాదు..తన సొంత డబ్బుతో ఎందరో ప్రజల కష్టాలు తీర్చాడు. సినిమాల్లోకి ఒకరకంగా అతను బలవంతంగా వచ్చాడు.. కానీ రాజకీయాలలోకి ఎంతో ఇష్టంగా.. సొంతంగా వచ్చాడు. ఏ తల్లి కైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది.. ఏ అన్న కైనా తన తమ్ముడు అనరాని మాటలు అనిపించుకుంటుంటే బాధగా ఉంటుంది. కానీ అలా బాధపడుతున్న నా తల్లికి నేను చెప్పిన మాట ఒక్కటే.. ఎందరో తల్లుల కోసం.. వారి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పవన్ యుద్ధం చేస్తున్నాడు.. ఇటువంటి అప్పుడు పడే బాధ ఎంతో గొప్పది.
మౌనంగా ఉండి మంచి అనిపించుకునే వాళ్ల వల్ల ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టం ఉంది అని నమ్మి.. జనం కోసం జనసైనికుడు అయ్యాడు పవన్. జనమే జయం అని నమ్మే జనసేన అని గెలిపించే బాధ్యత జనం మీదే ఉంది. పిఠాపురం ప్రజలు పవన్ కు.. అంటగా నిలిచి గెలిపించాలి అని నేను కోరుకుంటున్నాను. మీకు సేవకుడిగా.. ఒక సైనికుడిగా.. కొండంత అండగా పవన్ నిలబడతాడు.. మీకోసం ఎవరితో అయినా కలపడతాడు.. మీ కళ నిజం చేసి తీరుతాడు.. అని మెగాస్టార్ పిఠాపురం ప్రజలకు విన్నవిస్తూ ఓ వీడియో ని విడుదల చేశారు. ప్రస్తుతం చిరు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.